12-06-2025 12:05:57 AM
జగిత్యాల, జూన్ 11 (విజయక్రాంతి): మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇటీవల క్యా బినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్’ను బుధవారం జగిత్యాల క లెక్టర్ బి.సత్యప్రసాద్ పూల మొక్క అందించి అభినందించారు.
ఈ మేరకు మంత్రి హో దాలో తొలిసారి జిల్లాకు వచ్చిన అడ్లూరిని ధర్మపురి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి లక్ష్మ ణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా మరింత ప్రగ తి పథంలో పయనిస్తుందని ఆశాభావం వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి అంశాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై మంత్రితో కలెక్టర్చర్చించారు.