12-06-2025 12:04:46 AM
బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్
నిర్మల్ జూన్ 11 (విజయక్రాంతి): రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మోదీ గారి 11ఏళ్ల పాలనపై ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంల బుధవారం నిర్వహించారు జిల్లా పార్టీ అధ్యక్షులు రితేష్ రాథోడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా ఫోటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది ఆయన మాట్లాడుతూ మాట్లాడారు.
భారత దేశ విధానాలు ప్రపంచానికే దిక్సూచిగా మారుతున్నాయన్నారు. నరేంద్ర మోదీ పాలనలో ఒక దళితుణ్ణి , ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన సంగతినీ గుర్తు చేశారు. 370 ఆర్టికల్ రద్దు, భారత రాజ్యాంగంలో కాశ్మీర్ ను భాగస్వామ్యం చేయడం జరిగిందన్నారు.ఒక రక్తపు చుక్క నెలరాలకుండా భారత దేశంలో అతి పెద్ద సమస్యగా ఉన్న రామమందిర్ నిర్మాణం చేపట్టడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరించిందన్నారు. ఓకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని తీసుకురావడం, యోగాను ప్రపంచ యోగా దినోత్సవంగా చేయడంలో మోదీ సఫలీకృతం అయ్యారని పేర్కొన్నారు. పుల్వామా దాడి సర్జికల్ స్ట్రైక్, పెహల్గోన్ దాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేతల కీలక పాత్ర పోషించడం జరిగిందన్నా రు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అయ్యన్న గారి భూమయ్య, రావుల రామ్నా థ్ అంజు కుమార్ రెడ్డి, మేడిసేమ్మే రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కమల్ నయన్ , బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిసెల అర్జున్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షు లు రాచకొండ సాగర్, స్టేట్ కౌన్సిల్ సభ్యు లు దశరథ్ పోశెట్టి, నిర్మల్ పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్,భైంసా రూరల్ అధ్యక్షురాలు సీరం సుష్మా రెడ్డి మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి,వెంకట రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండాజి శ్రావణ్,బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.