12-06-2025 12:06:29 AM
కలెక్టర్ కుమార్ దీపక్
భీమారం (చెన్నూర్), జూన్ 11 : పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం ‘అమ్మ మాట - అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని భీమారం మండలం బూరుగుపల్లి గ్రామంలోనీ అంగన్వాడీ కేం ద్రంలో జిల్లా మహిళ-శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారి రౌఫ్ ఖాన్, మండల ప్రత్యేక అధికారి కల్పన, తహసీల్దార్ సదానందంతో కలిసి ఎగ్ బిర్యా నీ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభు త్వం పిల్లల సంక్షేమం దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాలలో వారానికి 2 సార్లు ఎగ్ బిర్యానీ అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు తమ సమీపంలో అంగన్వాడీ కేంద్రం సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.
పిల్లలకు బాల్యం నుండి ఆంగ్ల ము, తెలుగు, హిందీ భాషలు తెలుసుకునే లా అంగన్వాడీ టీచర్లు ఆటలు, పాటలు, కథలను బోధించాలని సూచించారు. అనం తరం అంగన్వాడీ కేంద్రంలో నూతనంగా చేరిన పిల్లలతో అక్షరాభ్యాసం చేయించి, పిల్లలతో కలిసి భోజనం చేశారు. అనంతరం కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం, వసతిగృహాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పాఠశాల ప్రారంభం రోజునే విద్యార్థుల కు నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఏకరూ ప దుస్తులు పంపిణీ చేయాలని, ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల హాజరు శాతంతో పాటు ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించేలా సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్, మండల విద్యాధికారి గోపాల్ రావు, సి.డి.పి.ఓ. మనోరమ, ఎ.సి.డి.పి.ఓ. శ్రావణి, సూపర్వైజర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.