ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి
నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ స్వప్న, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




