05-06-2025 01:50:50 PM
కలెక్టరేట్ ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తూ వాటి డిస్పోజల్ పకడ్బందీగా చేయాలి
పర్యావరణ దినోత్సవ వేడుకల్లో కలెక్టరేట్ లో ఏక్ పెడ్ మాకేనామ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి,(విజయక్రాంతి) : సమాజంలో మనం ఆశిస్తున్న మార్పు మన నుంచే ప్రారంభం కావాలని, మనం ముందు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని, చెత్తను సెగ్రిగేట్ చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(Collector Koya Sriharsha) అన్నారు. గురువారం అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ ఆవరణలో డీసీపీ కరుణాకర్, అదనపు కలెక్టర్ డి. వేణుతో కలిసి ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని కార్యాలయ ఆవరణలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, మనం వినియోగించిన ప్లాస్టిక్ చెత్త సెగ్రిగేట్ చేయాలన్నారు. కలెక్టరేట్ స్టాఫ్ పూర్తి స్థాయిలో ఇంటి వద్ద కూడా ప్లాస్టిక్ వాడకం నివారించాలని, చెత్తను సెగ్రిగేట్ చేయాలని, ప్రజలలో మనం ఆశిస్తున్న మార్పు మనం ప్రారంభం కావాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ప్లాస్టిక్ ఏరి వేత కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి శివయ్య, అటవీ శాఖ సిబ్బంది,జిల్లా అధికారులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది తో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.