వైఎస్సార్ జయంతికి రండి
03-07-2024 03:17 AM
- సీఎం, డిప్యూటీ, మంత్రి పొన్నంతో భేటీ అయిన షర్మిల
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి 75వ జయంతి కార్యక్రమాన్ని ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 8న విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్ర మానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్లను షర్మిల ఆహ్వానించారు.






