నడిరోడ్డుపై గుంత ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
23-08-2026 06:13 PM
బోథ్. ఆగస్టు 23 (విజయ క్రాంతి): మండలంలోని పొచ్చెర క్రాస్ రోడ్ వద్ద నడిరోడ్డుపై గుంత ఏర్పడింది దీంతో వాహనాలు నడిపేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నడి రోడ్డుపై ఉన్న గుంత ప్రమాదకరంగా మారడంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని ప్రయాణికులు అంటున్నారు. మూల మలుపు పైన ఉన్న ఈ గుంత వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని వాహన చోదకులు వాపోతున్నారు. ప్రమాదాలు జరగక ముందే అధికారులు కోరుతున్నారు.






