26 May, 2026 | 4:51 PM

Breaking News

కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •   ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •  

పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలు

24-03-2026 04:58 PM

నిర్మల్,(విజయక్రాంతి): విద్యార్థుల్లో నైపుణ్యతను వెలికి తీసేందుకు పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు జిల్లా పోస్టల్ శాఖ అధికారి గుంపు స్వామి అన్నారు. సోమవారం జిల్లాలోని పలు పాఠశాలలో విద్యార్థులకు పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలు నిర్వహించారు. సుమారు 52 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి 1గంట వరకు పరీక్షల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ తపాలా పర్యవేక్షకుడు బోరెడ్డి గుంప స్వామి,IP(C&PG) జాదవ్ కిరణ్,ఆదిలాబాద్ ఐపీ రాజు, ఆదిలాబాద్ హెచ్ఓ పీఆర్ఐపీ మహేష్ రెడ్డి, ఆఫీస్ అసిస్టెంట్ రాధికా, సిబ్బంది పాల్గొన్నారు.