24 August, 2026 | 10:27 PM

Breaking News

భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •  

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్‌పై ఫిర్యాదు

01-08-2024 04:12 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. జూలై 29వ తేదీన మధ్యరాత్రి వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గైర్హాజరుపై మన్నె క్రిశాంక్ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ట్వీట్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టను దిగజా ర్చేలా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ క్రిశాంక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు.