24 August, 2026 | 11:33 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

నకిలీ బంగారం ఇచ్చి..

01-08-2024 03:38 AM

నాలుగు లక్షలతో ఉడాయించిన దంపతులు

పటాన్‌చెరు, జూలై 31: కూతురు వివాహం కుదిరిందని, బంగారం పెట్టుకొని 4 లక్షలు ఇవ్వాలని నమ్మించి డబ్బుతో ఉడాయించిన ఘటన అమీన్‌ఫూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో నివాసం ఉండే రాజరాజేశ్వరి గత రెండు నెలలుగా బీరంగూడ భ్రమరాంబిక కాలనీలో కిరాణా దుకాణం పెట్టుకొని జీవిస్తోంది. ఆమె దుకాణానికి అప్పుడప్పుడు కిరాణా సామగ్రి తీసుకునేందుకు వచ్చే రమణమ్మ, ఆమె భర్త ఇద్దరూ కలిసి జూలై 7న తమ కూతురు పెళ్లికి డబ్బు కావాలని రాజరాజేశ్వరిని అడిగారు.

తమ దగ్గర ఉన్న బంగారం బిస్కెట్‌ను పెట్టుకొని ఎనిమిది లక్షలు ఇవ్వాలని కోరారు. అంత డబ్బు లేదని రాజరాజేశ్వరి రూ.4 లక్షలు ఇచ్చింది. ఐదు రోజుల తర్వాత పెళ్లి విషయం తెలుసుకునేందుకు రమణమ్మకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. అనుమానం వచ్చి బంగారు బిస్కెట్‌ను షాప్‌లో పరిశీలించగా నకిలీదని తేలింది. దీంతో దంపతులపై రాజరాజేశ్వరి అమీన్‌ఫూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై సోమేశ్వరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.