17-06-2025 12:00:00 AM
-lఎస్సై ప్రవీణ్ కుమార్
బెజ్జూర్, జూన్ 16 (విజయక్రాంతి): యో గా చేయడంతో సంపూర్ణ మైన ఆరోగ్యం లభిస్తుందని ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవo సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా యోగ శిక్షకులు జనగామ లక్ష్మణ్ ఆధ్వర్యంలో యోగ వాక్ నిర్వ హించారు.
ఈ సందర్భంగా ఎస్సై యోగ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. యోగ చేయండి ఆరోగ్యంగా ఉండండి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ మోహన్ నాయక్, ఫార్మసిస్ట్ అశోక్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ జిల్లాల సుధాకర్ గౌడ్,అధికారులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.