16-06-2025 11:23:12 PM
5 వేల రూపాయల జరిమానా..
నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మి తన కూతురు గొల్ల భార్గవికి పెళ్లి సంబంధాలు చూస్తున్న విషయంలో గాంధారి మండలం పెద్ద పోతంగల్ గ్రామానికి చెందిన ముక్కార శ్రీనివాస్ తండ్రి సాయిలు, 25 సం.లు అను అతను తాను భార్గవి ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నామని పెళ్లి చేసుకుంటానని చెప్పి గొడవలు చేసేవాడు. ఈ విషయంలో పెద్ద మనుషులతో మాట్లాడి అందరి సమక్షంలో సాంప్రదాయాల ప్రకారం తేది 31 జులై 2022న పెళ్లి చేశారు.
పెళ్లి తర్వాత కొంతకాలం తన కూతురుతో శ్రీనివాస్ బాగానే ఉన్నాడని తర్వాత శ్రీనివాస్ అతని తల్లి ముక్కార లక్ష్మి, లు ఇద్దరు కలిసి కూతురు పై లేని పోనీ అనుమానాలు పెట్టుకొని అదనపు కట్నం తీసుకురావాల్సిందని, శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేసే వారు. ఇట్టి విషయంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు పలుమార్లు నిర్వహించి పంపించారు. కానీ వారిలో ఎలాంటి మార్పు రాలేదు. తల్లిగారింటి వద్దనే ఉండగా ఒక కుమారుడు జన్మించాడు.
అప్పుడు కూడా భర్త శ్రీనివాస్ అతని తల్లి చూడడానికి కూడా రాలేదు. మళ్లీ పంచాయతీ నిర్వహించి పంపించారు. అయినను కూడా భర్త శ్రీనివాస్, అత్త లక్మి వేధింపులు భరించలేక చివరికి ఏదో విషం త్రాగి ఇంట్లో పడిపోయింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా కొద్ది రోజుల చికిత్స తర్వాత భార్గవి మరణించింది. ఇట్టి విషయంలో దేవనపల్లి పోలీస్ స్టేషన్ లో తేది 22. సెప్టెంబర్ 2023 నాడు ఫిర్యాదు చేయగా భర్త శ్రీనివాస్,అత్త లక్మి పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడం జరిగింది.
విచారణలో భాగముగా సాక్షులు, డాక్టర్ రిపోర్టులు మిగితా అన్నిరకాల సాక్షాలను సేకరించి నింధితులు అగు భర్త ముక్కార శ్రీనివాస్ తండ్రి సాయిలు, అత్త ముక్కార లక్ష్మి, 45 సం.లు వారిని అరెస్టు చేసి కోర్ట్ లో చార్జ్ షీట్ సమర్పించగా కోర్ట్ వారు సాక్షులను విచారించి, ఆధారాలను పరిశీలించి కామారెడ్డి జిల్లా సెషన్స్ కోర్ట్ జిల్లా న్యాయమూర్తి గౌరవ విఆర్ఆర్. వరప్రసాద్ చివరగా నిందితుడు ముక్కార శ్రీనివాస్ పై నేరం ఋజువు కావడంతో 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష 5 వేల రూపాయల జరిమానా విధించారు.
సరియగు పద్దతిలో పరిశోధన చేసిన అధికారి అప్పటి కామారెడ్డి డి.ఎస్.పి ఆర్ ప్రకాష్ , దేవునిపల్లి ఎస్ఐ జి.రాజు,, కేసును పర్యవేక్షించిన కామారెడ్డి రూరల్ సి ఐ రామన్, పోలీసు తరపున వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజగోపాల్ గౌడ్, కోర్ట్ కానిస్టేబుల్స్ దేవిచంద్, కోర్టు లైసనింగ్ అధికారి ఎస్ ఐరాజయ్య, ఏఎస్ఐ రమేశ్వర్ రెడ్డి , కామారెడ్డి జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అబినందించారు.