24 August, 2026 | 10:19 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

ఎఫ్టీఎల్, బఫర్‌జోన్లు నిర్ధారించండి

28-11-2024 02:03 AM
  1. డిసెంబర్ ౩౦లోగా నివేదిక ఇవ్వాలి
  2. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 27(విజయక్రాంతి) : హెచ్‌ఎండీఏ పరిధిలోని మొత్తం చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్స్ (ఎఫ్టీఎల్) తేల్చాలని, ఈ మేరకు తుది నోటిఫికేషన్ వెలుడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యల నివేదికను డిసెంబరు 30న జరిగే విచారణ నాటికి అందజేయాలని స్పష్టంచేసింది.

రామమ్మకుంటలో ఎఫ్టీఎల్ పరిధిలో నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టూరి జం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కట్టడా లు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. ఈ ఏడాది జులై 24న వ్యక్తిగతంగా హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ ఖాన్ హైకోర్టుకు తెలిపిన వివారాల ప్రకారం హెచ్‌ఎండీఏలో 3,532 చెరువులు ఉన్నాయని, 230 చెరువులకు ఎఫ్టీఎల్ కోసం తుది నోటిఫికేషన్ ఇచ్చా మని చెప్పారు.

అనంతరం ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ హెచ్‌ఎండీఏ పరిధిలో ఇప్పు డు 2,793  చెరువులు ఉన్నాయని, వాటిలో 530 చెరువులకు తుది నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. అప్పటికి, ఇప్పటికీ చెరువుల సంఖ్య పెరగడంపై హైకోర్టు ఆరా తీసింది.

ఇప్పుడు కూడా తుది నోటిఫికేషన్‌కు మళ్లీ 3 నెలల గడువు కావాలని కోరడాన్ని హైకోర్టు అంగీకరించలేదు. హెచ్‌ఎండీఏలోని అన్ని చెరువుల వ్యవహారంపై సుమోటోగా విచారణ చేస్తున్నట్టు ప్రకటించింది. వచ్చేనెల 30వ తేదీ నాటికి హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల గుర్తింపుపై రిపోర్టు ఇవ్వాలని హెచ్‌ఎండీఏను ఆదేశించింది.