29-06-2025 04:08:02 PM
నిజామాబాద్: నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రైతు సమ్మేళన్ సభ ఏర్పాటు చేశారు. జిల్లాలోని వినాయక్ నగర్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం రైతు సమ్మేళన్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... ఎంతో పోరాటం చేసి నిజామాబాద్ కు పసుపు బోర్డు పసుపు బోర్డు సాధించిన నిజామాబాద్ రైతులకు అభినందనలు తెలిపారు. పసుపు బోర్టు ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధన్యవాదాలు బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, బీజేపీకి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు వెల్లడించారు.