calender_icon.png 29 June, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోతలు లేని విద్యుత్ ను ఇస్తున్నది ప్రధాని మోదీ: కిషన్ రెడ్డి

29-06-2025 04:22:45 PM

నిజామాబాద్: నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ... నిజామాబాద్ కు పసుపు బోర్డు ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోనూ పసుపు పంట బాగా వేస్తారు.  మధ్యప్రదేశ్, మహారాష్ట్రను కాదని తెలంగాణకు పసుపు బోర్డు ఇచ్చారన్నారు. దేశవ్యాప్తంగా కోతలు లేని విద్యుత్ ను ఇస్తున్నది ప్రధాని మోదీ కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో ఎరువుల కోసం గంటల తరబడి క్యూలో ఉండేవారని, ఇప్పుడు రైతులకు అవసరమైనంత యూరియాను కేంద్రం ఇస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు.