25-06-2024 12:05:00 AM
కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవుల విషయంలో నిజాయితీని పాటించాలి. మొదటి నుంచీ పార్టీనే నమ్ముకొని, జీవితాలను ధారపోస్తున్న కార్యకర్తలను గుర్తించమని అధినాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. పైరవీలు, డబ్బు, అధికారం వంటి వాటికి లొంగకుండా కష్టపడి పనిచేస్తున్న వారిని ప్రోత్సహించాలి. క్షేత్రస్థాయి కార్యకర్తలకు తగిన రీతిలో గౌరవం, గుర్తింపు ఇవ్వడం ద్వారా పార్టీ మరింత బలోపేతమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
-ఇందిరా ప్రియదర్శిని