01-06-2025 10:13:31 PM
ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య..
హుజురాబాద్ (విజయక్రాంతి): మినీ స్టేడియం ఆపేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కొలిపాక సమ్మయ్య మాట్లాడుతూ.. 10 కోట్లు ఎగవేసేందుకే హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు 10 లక్షల వాకింగ్ ట్రాక్ భూమి పూజ చేశారన్నారు. హుజురాబాద్ కు మినీ స్టేడియం రాకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా, విప్ గా పనిచేసిన ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని క్రీడాకారుల భవిషత్తును ప్రజల ఆరోగ్యలను దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ పరిమానాలతో పట్టణంలోని హైస్కూల్ మైదానంలో మినీ స్టేడియనికి రూపకల్పన చేసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ని ఒప్పించి 10 కోట్లు మంజూరు చేయించారన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధి ఇష్టం లేని కాంగ్రేస్ నాయకులు ఇప్పుడు 10 లక్షలతో వాకర్స్ ట్రాక్ ఏర్పాటు చేసి మినీ స్టేడియం ఏర్పాటును అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఈ ప్రాంత క్రీడాకారులు ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో ప్రభుత్వాలు హామీ ఇచ్చినప్పటికీ మినీ స్టేడియం కలగానే మారింది అన్నారు. కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడ పోటీచేసి ఓడిపోయిన కాంగ్రేస్ అభ్యర్థి ఒడితల ప్రణవ్ బాబు తనను తిరస్కరించిన ఈ ప్రాంత ప్రజలపై కక్ష తీర్చుకొనేందుకు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సమ్మయ్య విమర్శించారు.
అధికార పార్టీలో ఉండి హుజురాబాద్ కాంగెస్ పార్టీ ఇంచార్జ్ గా వున్నా రాజకీయ విద్యార్థి ప్రణవ్ బాబుకి చేతనైతే మినీ స్టేడియనికి మంజూరైన 10 కోట్ల రూపాయలను ప్రభుత్వం నుండి విడుదల చేయించి స్టేడియాన్ని నిర్మించేందుకు కృషి చేయాలిగాని ఓట్ల రాజకీయాలు చేయడమెందుకని ప్రశ్నించారు. ప్రణవ్ బాబుకి ఇంకా పదేళ్ల దాకా పదవి భాగ్యం లేదని రాబోయే ఎలాంటి ఎన్నికల్లో అయిన ఈ ప్రాంతంలో ఎగిరేవి బి ఆర్ ఎస్ జెండాలేనని అన్నారు.