13-06-2025 05:53:43 PM
నిర్మల్,(విజయక్రాంతి): మైనారిటీల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుందని బీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకులు ఆరోపించారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలో సోషల్ మీడియా ఇంచార్జ్ రిజ్వాన్ ఖాన్ పట్టణ ప్రధాన కార్యదర్శి అక్రమ్ అలీ నాయకులు మహమ్మద్ రహీం మసూద్ ఖాన్ తదితరులు మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలు అన్యాయం గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాబినెట్ సమావేశంలో మైనారిటీలు అభివృద్ధిపై ప్రభుత్వం ఇప్పటివరకు చర్చించలేదని మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యాసంస్థల్లో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు.