13-06-2025 05:49:58 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బీఆర్ఎస్ భవన్ వద్ద తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. చికిత్స పొంది ఇంటికి రావడంతో కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం హైదరాబాద్ వెళ్లి మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటికి వెళ్లి కామారెడ్డి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి గైని శ్రీనివాస్ గౌడ్, భిక్కనూరు మండల నాయకులు మహేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాసుల లక్ష్మీనారాయణ పరామర్శించి యోగక్షేమాలను తెలుసుకున్నారు.