13-06-2025 05:57:50 PM
నిర్మల్,(విజయక్రాంతి): జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో 50% ఫీజు రాయితీ కోసం నిర్మల్ జిల్లా విద్యాధికారికి టీఎస్జేయూ అధ్యక్షుడు జవాన్ సుదర్శన్, సభ్యులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో 50% ఫీజు రాయితీ కల్పించాల్సిందిగా డీఈఓతో కోరారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు 50 శాతం రాయితీ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వ జీవో కాపీని అమలు చేయాలని సూచించారు.