18-06-2025 12:00:00 AM
మంథని మాజీ జెడ్పిటిసి మూల సరోజన పురుషోత్తం రెడ్డి
మంథని జూన్ 17(విజయ క్రాంతి); కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వమని రైతుల సంక్షేమ ప్రభుత్వం ద్వేయమని మంథని మాజీ జడ్పిటిసి మూల సరోజన పురుషోత్తం రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.రైతుబంధు పథకంతో రైతుల ఎకౌంట్ల లో డబ్బులు పడడం చాలా సం తోషంగా ఉందని రైతు బిడ్డగా ఆమె పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని, మేనిఫెస్టో లో పెట్టిన విధంగా రైతులందరికీ ఎలాంటి కోత లేకుండా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు అకౌంట్లో డబ్బులు వేస్తున్నారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తు న్నారన్నారు. బడ్జెట్లో దాదాపు రూ. 70 వేల కోట్లకు పైగా రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తుందని, రైతు బంధు పథకంతో రూ. 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
రెండు లక్షల రుణమాఫీ తో పాటు రైతులందరికీ రైతుబంధు ఇవ్వడాన్ని రైతులందరూ స్వాగతించాలని, రాబోయే ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో రైతులందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఆమె కోరారు. రైతు బంధు పంట పెట్టుబడి కింద డబ్బులు వేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి శ్రీధర్ బాబు కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.