18-06-2025 12:00:00 AM
ముత్యాల, పోచమ్మకు, నల్లపోచమ్మకు, జనసంద్రంగా, కదిలిన గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్న గ్రామస్తులు
ఎల్లారెడ్డి, జూన్ 17(విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్లలో మంగళవారం ముత్యాలపోచమ్మ,నల్లపోచమ్మకు అంగరంగ వైభోవంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆడపడుచులు వీధి వీధిన బోనాలు ఎత్తుకొని బాజా భజంత్రీలు,పోతారాజుల విన్యాసాలు, శివసత్తుల సిగలతో,యువకులు డిజె స్టెప్పులతో బోనాలు తీసినారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంట రాజేశ్వరి-సాయిలు, సొసైటీ చైర్మన్ పటేల్ సాయిలు, కాంగ్రెస్ మండల బిసి సెల్ అధ్యక్షులు కమ్మరి భాస్కర్,సాయిలు,రవి, వెంకటరమణ,అంజయ్య,గ్రామస్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.