ప్రజలను మోసం చేసేలా కాంగ్రెస్ హామీలు

24-04-2024 12:11:59 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఆరు గ్యారెంటీల అమలుకే దిక్కులేదు కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్మాణంపై మరో కొత్త గ్యారెం టీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ అన్నా రు. కాగజ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తే తప్ప కాంగ్రెస్‌కు ప్రజలు గుర్తుకు రారని విమర్శించారు. ఎంపీ ఎన్నికలు ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మోసపూరిత హామీలు ఇస్తున్నారని విమర్శించారు. సమావేశంలో పార్టీ వివి ధ విభాగాల బాధ్యులు ధోని శ్రీశైలం, గణపతి, ముత్తు అశోక్, అరుణ్ లోయ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.