ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమైనది

24-04-2024 12:10:19 AM

కామారెడ్డి, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమని  కలెక్టర్ జితేష్ వీ పాటిల్ అన్నారు. స్విప్ ఆధ్వ ర్యంలో ట్రాన్స్‌జెండర్లతో మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటు వేయడానికి వెళ్తే అందరూ చులకనగా చూస్తారనే అపోహ వీడి ధైర్యంగా ఓటు వేయాలని సూచించా రు. జిల్లాలో సుమారు 30 మందికి పైగా ట్రాన్స్‌జెండర్లు ఓటు హక్కు కలిగి ఉన్నారని.. గత శాసనసభ ఎన్నికల్లో ఎంతో ఉత్సాహం గా ఓటింగ్‌లో పాల్గొన్నారని ప్రశంసించారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఓటు నమో దు చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమాధికారి బావయ్య, స్వీప్ అధికారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.