3 July, 2026 | 5:55 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం

13-05-2026 04:02 PM

ఎల్లారెడ్డిపేట,(విజయక్రాంతి): రాచర్ల బొప్పపూర్ గ్రామంలో బుధవారం రోజు జరిగిన  పాలకవర్గం సాధారణ సర్వసభ్య సమావేశం సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి అధ్యక్షతన నిర్వహించడం జరిగిందన్నారు.ఇట్టి సమావేశంలో గ్రామంలో పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించడం జరిగిందని, గ్రామంలో జరిగే ఎలాంటి కార్యక్రమాలకు అయిన కుడా ప్లాస్టిక్ ప్లేట్లను ప్లాస్టిక్ గ్లాసులను వాడకూడదు అని నిర్ణయించడం జరిగిందన్నారు. గ్రామంలో జరిగే శుభాకార్యలకు గ్రామ పంచాయతీ తరుపున స్టిల్ ప్లేట్లను మరియు స్టీల్ గ్లాసులను అందుబాటులో ఉంచుతామని సర్పంచ్ ఇల్లేందుల గీతాంజలి-  శ్రీనివాస్ రెడ్డి లు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండాపురం వెంకట్ రెడ్డి మరియు కార్యదర్శి సంతోష్ వార్డు మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు.