15-10-2025 05:38:42 PM
కుభీర్ (విజయక్రాంతి): కుభీర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు తరచుగా తరగతులకు హాజరు కాని పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని, అధ్యాపకులు తల్లిదండ్రులతో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులు తరగతులకు సక్రమంగా హాజరు కావాలని, చదువులో ప్రతిభ చూపాలని అధ్యాపకులు తల్లిదండ్రులను అవగాహన చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో K. సంపత్, హన్మంతరావు, నర్సయ్య, శివరాజ్, శ్రీనివాస్ రావ్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.