03-06-2025 05:05:39 PM
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో దపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మునిపల్లి మండలం, గోపులారంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రమేశ్(38), అనిత(32) దంపతులు మునిపల్లి మండలం, గోపులారంలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ తన సిబ్బందితో ఘటన స్థలికి చేరుకున్నారు. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, కొండాపూర్ సీఐ వెంకటేష్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహలను స్వాధీనం చేసుకొని సదాశివపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలి అన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తల్లిదండ్రుల మృతితో ముగ్గురు చిన్నారులు అనాధాలుగా మారారు. భార్యాభర్తల ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.