27 June, 2026 | 7:36 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

పల్స్ పోలియోను విజయవంతం చేయండి

27-06-2026 06:49 PM

మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఈ నెల 28న ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో  5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత కోరారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా వ్యవహరించి, సమీప పోలియో బూత్‌కు తమ చిన్నారులను తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. "రెండు చుక్కలు  ప్రతి చిన్నారికి, ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు" అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ ప్రజలకు అంతటి పుష్పలత పిలుపు నిచ్చారు.