09-06-2025 07:52:11 PM
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం..
అనర్హత పిటిషన్ కొట్టివేయడంతో పాల్వంచలో సీపీఐ సంబరాలు..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): నిజం గెలిచింది ఆ విషయం కోర్టు తీర్పుతో నిరూపణ అయిందని, ప్రజా తీర్పును అపహాస్యం చేద్దామని కొందరు స్వార్థపరులు చేసిన ప్రయత్నం కోర్టు తీర్పుతో భంగపడ్డారని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం(CPI Rashtra Samithi members Mutyala Vishwanath) అన్నారు. కొత్తగూడెంకి చెందిన మందులాల్ అగర్వాల్ ఎమ్మెల్యే కూనంనేనిపై వేసిన అనర్హత పిటిషన్ గౌరవ హైకోర్టు సోమవారం డిస్మిస్ చేయడంతో పాల్వంచలో సిపిఐ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి. స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ నుండి పాల్వంచ పట్టణంలోని ప్రధాన కూడలిలో టపాసులు కాలుస్తూ ప్రదర్శన నిర్వహించారు.
పూనంనేనికి అనుకూలంగా తీర్పురావటంతో తమ ఆనందాన్ని ప్రజలతో పంచుకున్నారు కూనంనేని జిందాబాద్, సిపిఐ జిందాబాద్ నినాదాలతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ... ఎన్నికల అనర్హత పిటిషన్ కొట్టివేస్తూ గౌరవ హైకోర్టు ప్రత్యర్థికి మొట్టికాయలు వేసిందన్నారు. దీనితో ధర్మం ఆలస్యమైన నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబా మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు ఉప్పుశెట్టి రాహుల్ గుండాల నాగరాజు, నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, నిమ్మల రాంబాబు, మన్నెం వెంకన్న, రహమాన్, గౌస్, Ys గిరి, వేములపల్లి రాజశేఖర్, కోరే కృష్ణ, రామారావు, సర్వయ్య తదితరులు పాల్గొన్నారు.