ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు
30-05-2026 09:59 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ప్రపంచ మానవాళి విముక్తికి మార్క్సిజమే ఏకైక మార్గమని ఆ సిద్ధాంతం మాత్రమే ఒక మనిషిని మరొక మనిషి దోచుకునే వ్యవస్థను సమూలంగా మార్చి దోపిడీ లేని నూతన సమాజాన్ని నిర్మిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పి. సత్యం అన్నారు. శనివారం ఘట్కేసర్ పట్టణంలో సిపిఎం మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులలో సత్యం ముఖ్యఅతిథిగా పాల్గొని అంతర్జాతీయ జాతీయ పరిస్థితులు అనే అంశంపై క్లాస్ బోధించారు. ఈ తరగతులకు సిపిఎం మండల కార్యదర్శి ఎన్. సబిత ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. ఈ శిక్షణా తరగతుల ప్రారంభ సూచకంగా సిపిఎం సీనియర్ నాయకులు చింతల యాదయ్య సిపిఎం పతాకాన్ని ఎగురవేశారు.






