30 May, 2026 | 10:35 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి

30-05-2026 10:02 PM

భూత్పూర్ :  చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సీడీపీవో జ్యోతి అన్నారు. ఈ సందర్భంగా భూత్పూర్ మండల పరిధిలోని తాటికొండ గ్రామంలో నిర్వహించిన అంగన్వాడి బడిబాట కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలు, శారీరక–మానసిక వికాసానికి సంబంధించిన ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించారు.

ఈ సందర్భంగా సూపర్‌వైజర్ సుశీల మాట్లాడుతూ అర్హులైన ప్రతి చిన్నారిని అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించి ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు కరుణమ్మ, మాణిక్యమ్మ, దర్శనమ్మ, ఫాతిమా పాల్గొని కేంద్రాల్లో అందిస్తున్న సేవల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ ఆయాలు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.