ఎఫ్.ఎఫ్.స్ యాప్ పైన రైతులకు అవగాహన కల్పించండి
రైతులకు సరిపడా యూరియా,ఎరువులు అందుబాటులో ఉంచాలి
(కూసుమంచి, విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చిన ఫ్రేంవర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ యాప్ పైన పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చ మండల అధ్యకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏ.డీ.ఏ రాజేశ్ కి మరియు ఏం.ఏ.ఓ వాణీ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి వారితో మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా ఎఫ్ ఎఫ్ స్ యాప్ పైన కొంత అవగాహన లోపం వలన రైతులు తమ వ్యవసాయ పంటల అవసరాల కోసం యూరియా మరియు ఎరువులు కొనుగోలు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, వారి కోసం ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో లేదా క్లస్టర్ పరిధిలో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేయాలని, సమావేశాలు ఏర్పాటు గురించి రెండూ లేదా మూడు రోజులు ముందుగానే మీడియా, ఊరి చాటింపు మరియు సోషల్ మీడియా ద్వారా రైతులు అందరికీ పూర్తి స్థాయిలో సమాచారం అందించి యాప్ పట్ల అవగాహన కల్పించాలని కోరడం జరిగింది.
అదేవిధంగా కొద్ది మంది ఏ.ఈ. ఓ లు తమ క్లస్టర్ పరిధిలో రైతులకు అందుబాటులో లేకపోవడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని కావున అందరినీ కూడా పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులు ఇబ్బందలు పడకుండా చేసే విధముగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. యూరియా, డీ ఏ పి కొరత లేకుండా చూడాలని, ఫెర్టిలైజర్ షాపులను ఆకస్మిక తనిఖీలు చేసి, మందులు అందుబాటులో ఉంచి, రైతులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేయడం జరిగినది. కార్యక్రమం లో జిల్లా యువజన నాయకులు మంద చంద్రశేఖర్ గౌడ్, మంద నవ్య తదితరులు పాల్గొన్నారు.






