09-06-2025 02:05:36 AM
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
రాజేంద్రనగర్, జూన్ 8: చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొందించాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సూచించారు. అత్తాపూర్ నలందనగర్ రోడ్ నంబర్13లో ఏర్పాటు చేసిన కిడ్జి ప్లే స్కూల్ ను ఆదివారం ఆయన ప్రిన్సిపాల్ శిరీష, మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాల్యంలో పిల్లలకు సృజనాత్మక ఆలోచనలు పెంపొందించేలా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందన్నారు.
వారికి చక్కని క్రమశిక్షణ అలవర్చి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం పోటీ ప్రపంచానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఎప్పకటికప్పుడు టెక్నాలజీని అందుపుచ్చుకోవాలని తెలియజేశారు.
విద్యార్థులు మక్కువ చూపించే అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్,ప్రిన్సిపాల్ శిరీష ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ను శాలువా కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పలుగు చెరువు మహేష్, ప్రభాకర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు మిద్దెల భుజంగారెడ్డి, నరసింహ తదితరులుపాల్గొన్నారు.