31-05-2025 12:00:00 AM
జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్
మంచిర్యాల, మే 30 ( విజయక్రాంతి): జిల్లాలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 25,280 మంది రైతుల మంచి ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాలలో రూ. 271 కోట్లు జమ చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ తెలిపారు. జిల్లాలో 345 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 1,77,465 మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశామన్నారు.
రైతు ల వద్ద నుండి పూర్తి స్థాయిలో నిబంధనల ప్రకారం వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసిన 216 కొనుగోలు కేంద్రాలను మూసి వేయడం జరిగిందని తెలిపారు.