24 April, 2026 | 2:38 PM

Breaking News

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతూ సంఘీభావం తెలిపిన బీఎస్పీ నాయకులు   •   ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం   •   మండేపల్లిలో చలివేంద్రం ప్రారంభం – ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన   •   డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   శంకర్‌ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం.. ఆర్టీసీలో ఉద్యోగం: నర్సంపేట ఆర్‌డీఓ   •   సచివాలయంలో ఆర్టీసీ సమ్మెపై కీలక చర్చలు.. RTC కార్మికుల 3 ప్రధాన డిమాండ్లు ఇవే   •   తిరుమల శ్రీవారికి భారీగా బంగారం విరాళం   •   కారు అదుపుతప్పి బోల్తా.. మహిళ మృతి   •   ఖమ్మంలో రైతుల కోసం మహాధర్నా   •   బండి సంజయ్‎ను అడ్డుకున్న పోలీసులు.. నర్సంపేటలో హైటెన్షన్   •  

2.17 కోట్ల సిమ్‌కార్డులు రద్దు?

01-10-2024 12:35 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: నకిలీ పత్రాలతో పొందిన, సైబర్ క్రైమ్‌లతో సంబంధం ఉన్న 2.17 కోట్ల సిమ్‌కార్డులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వీటితో పాటు 2.26 లక్షల మొబైల్స్‌ను బ్లాక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో టెలికాంశాఖ సమాచా రాన్ని సమర్పించినట్లు తెలుస్తోంది.

సిమ్‌కార్డులు జారీ సమయంలో కేవైసీని సమర్థంగా అమలు చేసేందుకు కఠిన చర్యలు చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కంబోడియా కేంద్రంగా జరుగుతున్న సైబర్ నేరాల గురించి కొన్నినెలల కింద మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దాదాపు 5వేల మంది భారతీయులు ఆ దేశంలో చిక్కుకుపోయారని, వారి ఇష్టానికి వ్యతిరేకంగా వారితో నేరాలు చేయిస్తున్నారని తెలుస్తోంది.

ఈ విషయం వెలుగులోకి రావడంతో కేంద్రం మంత్రిత్వశాఖలతో కమిటీని వేసింది. బ్యాంకింగ్, ఇమిగ్రేషన్, టెలికాం సెక్టార్లలో ఉన్న లోపాలను ఆ కమిటీ గుర్తించింది. ఇంటర్నేషనల్ కాల్స్‌ను బ్లాక్ చేయాలని ఆపరేటర్లకు టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసింది.