14-05-2025 08:43:27 AM
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams)లో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి (Srivari Sarva Darshan) 3 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు. 74,477 మంది భక్తులు మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. 28,294 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.84 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.