2 April, 2026 | 3:49 PM

Breaking News

కేసీఆర్‌ను జైల్లో పెడతానన్న రేవంత్ — ఇప్పటివరకు ఏం చేశారు?   •   కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సాకారం..   •   పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •  

క్రౌడ్ ఫండింగ్ ఫర్ వయనాడ్

09-08-2024 12:39 AM

తమిళనాడులోని హోటల్ వ్యాపారి వినూత్న ఆలోచన

దిండిగల్ (తమిళనాడు), ఆగస్టు 8: వయనాడ్ బాధితుల కోసం తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన ఓ హోటల్ వ్యాపారి ముజీబ్ వినూత్నంగా ఆలోచించాడు. తన హోటల్‌లో ఓ విందును ఏర్పాటు చేస్తున్నానని.. విందులో పాల్గొన్నవారు వయనాడ్ బాధితుల కోసం విరాళాలు అందించాల్సిందిగా కస్టమర్లను కోరుతూ ఓ పోస్టు పెట్టాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం తన హోటల్‌లో సేవలను నిలిపివేసి.. హాల్‌లో వరుసగా టేబుల్‌లు వేసి విందు ఏర్పాట్లు చేశాడు. ఈ విందుకు అతడు అనుకున్న దానికన్నా అనూహ్య స్పందన వచ్చింది. విందు ద్వారా వచ్చిన నగదును వయనాడ్‌లోని బాధితుల కోసం ఖర్చుపెట్టనున్నట్లు ముజీబ్ తెలిపాడు.