27 June, 2026 | 7:47 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

స్మితా సభర్వాల్‌కు పోలీసుల నోటీసులు

16-04-2025 02:58 PM

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) సమీపంలోని కంచ గచ్చిబౌలికి సంబంధించిన చిత్రాన్ని సోషల్ మీడియాలో తిరిగి పోస్ట్ చేసినందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిణి, తెలంగాణ యువజనాభివృద్ధి, పర్యాటక, సంస్కృతి ప్రధాన కార్యదర్శి స్మితా సభర్వాల్‌కు(IAS officer Smita Sabharwal) సైబరాబాద్ పోలీసులు బుధవారం నోటీసు జారీ చేశారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 179 కింద ఈ నోటీసును ఐఏఎస్ అధికారిణికి అందించారు. ఏఐ జనరేటెడ్ గిబ్లి చిత్రాన్ని ఆమె సోషల్ మీడియాలో తిరిగి పోస్ట్ చేశారు. హెచ్సీయూ సమస్యకు సంబంధించిన గిబ్లి చిత్రాలను పోస్ట్ చేసిన వారందరికీ తెలంగాణ పోలీసులు(Telangana Police) నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ విషయంపై సీనియర్ అధికారులను సంప్రదించినప్పుడు వారు నోరు విప్పలేదని పోలీసులు తెలిపారు.