స్మితా సభర్వాల్కు పోలీసుల నోటీసులు
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) సమీపంలోని కంచ గచ్చిబౌలికి సంబంధించిన చిత్రాన్ని సోషల్ మీడియాలో తిరిగి పోస్ట్ చేసినందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిణి, తెలంగాణ యువజనాభివృద్ధి, పర్యాటక, సంస్కృతి ప్రధాన కార్యదర్శి స్మితా సభర్వాల్కు(IAS officer Smita Sabharwal) సైబరాబాద్ పోలీసులు బుధవారం నోటీసు జారీ చేశారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 179 కింద ఈ నోటీసును ఐఏఎస్ అధికారిణికి అందించారు. ఏఐ జనరేటెడ్ గిబ్లి చిత్రాన్ని ఆమె సోషల్ మీడియాలో తిరిగి పోస్ట్ చేశారు. హెచ్సీయూ సమస్యకు సంబంధించిన గిబ్లి చిత్రాలను పోస్ట్ చేసిన వారందరికీ తెలంగాణ పోలీసులు(Telangana Police) నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ విషయంపై సీనియర్ అధికారులను సంప్రదించినప్పుడు వారు నోరు విప్పలేదని పోలీసులు తెలిపారు.




