28-06-2025 10:51:00 PM
వేములపల్లి,(విజయక్రాంతి): కుటుంబ తగాదా లతో అత్త పై కోడలు కర్రతో దాడి చేయడంతో అత్త మృతి చెందిన సంఘటన వేములపల్లి మండలం సల్కునూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుర్రం అంజమ్మ (72)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు నాగయ్య భార్య పార్వతమ్మతో మూడు రోజుల క్రితం ఇంటి సమస్య విషయమై గొడవపడ్డారు. దీంతో పార్వతమ్మ మృతురాలు అంజమ్మ తలపై కర్రతో దాడి చేయగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ కి తరలించగా ఇక్కడి డాక్టర్లు పెద్ద ఆసుపత్రికి తీసుకుపోవాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు నల్లగొండలోని ఓ హాస్పిటల్ కి తరలించగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అంజమ్మ బాడీ చికిత్సకు సహకరించకపోవడంతో కుటుంబ సభ్యులు అంజమ్మ స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆమె శనివారం మధ్యాహ్నం మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు అంజమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ దావకానకు తరలించారు.