09-09-2025 12:51:11 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వ భాగస్వామ్యంతో ఆస్ట్రేలియాకు చెందిన ప్రతిష్ఠాత్మక డికన్ యూనివర్సిటీ తెలంగాణలో ‘ఏఐ’ సెంట ర్ ఆఫ్ ఎక్సలెన్స్ నెలకొల్పేందుకు ముం దుకొచ్చింది. ఈమేరకు వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్, రాష్ట్ర ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సమక్షంలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ)పై సంతకాలు చేశారు అనంతరం పరస్పరం ఒప్పంద పత్రాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి సంస్థల భాగస్వామ్యంతో తెలంగాణను ఏఐ రంగంలో గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సర్కార్ ముందుకు వెళ్తున్నదని తెలిపారు. ఏఐలో నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో డికన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నామని వివరించారు.
ఈ ఒప్పందం కేవలం లాంఛనప్రాయ ఒప్పందం కాదని, రానున్న రోజుల్లో కీలక రంగాల్లో తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య ద్వుపాక్షిక సంబంధాల బలోపేతమయ్యేందుకు ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు. సమాజానికి ఉపయోగపడే అత్యాధునిక ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడంతో పాటు పరిశోధనలను ముమ్మరం చేసేందుకు, తద్వారా కొత్త అవకాశాలను సృష్టించేందుకు సెంటర్ ఉపయోగపడుతుందని వివరించారు.
స్టార్టప్లకు చేయూత..
కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో ప్రపంచానికి మెరుగైన నైపుణ్యాలున్న మానవ వనరులను తెలంగాణ నుంచే అందించాలని లక్ష్యంగా పెట్టుకుని, చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, యంగ్ ఇండియన్ స్కిల్ వర్సిటీ సంయుక్తంగా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఏఐ కోర్సులకు రూపకల్పన చేస్తాయని వివరించారు. తద్వారా రాష్ట్ర యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇస్తామన్నారు.
తెలంగాణ నుంచి వచ్చే ఏఐ స్టార్టప్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో రాష్ట్రానికి బ్రాండ్ తీసుకువస్తాయని ఆకాంక్షించా రు. అందుకు అనుగుణంగా ఆస్ట్రేలియాకు చెందిన నిపుణులు మార్గదర్శకత్వం చేస్తున్నారని వెల్లడించారు. ఏఐని సమ్మిళిత వృద్ధికి, మానవాభివృద్ధికి ఒక శక్తిమంతమైన సాధనంగా మార్చేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. లక్ష్య సాధనలో సెంటర్ మార్గదర్శి అవుతుందని ఆకాంక్షించారు.
ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గవర్నెన్స్ తదితర రంగాల్లో ఏఐ వినియోగాన్ని పెంచి పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తామన్నారు. ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఏఐ ఆధారిత పరిష్కారాలను కనుగొంటామన్నారు. సమావేశంలో డిప్యూటీ కాన్సూల్ జనరల్ (ఆస్ట్రేలియన్ కాన్సూలేట్- జనరల్ బెంగళూరు) స్టీవెన్, కాన్సూల్ ఆండ్రూ కాలిస్టర్, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కమిషనర్ వికా సింగ్, పొలిటిల్, ఎకానమిక్ రీసెర్చ్ ఆఫీసర్ రంజని మాధవన్, డికన్ యూనివర్సిటీ ప్రతినిధులు రౌనీత్ పాహ్వా, ప్రియాంక సింగ్, గాయ త్రి వేద్ నారాయణన్ పాల్గొనాl్నరు.
అందుకే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్, వీసీ, డికన్ యూనివర్సిటీ
ఏఐ రంగంలో తెలంగాణను గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని డికన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్ అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం సమర్థమైన, బాధ్యతాయుతమైన ఏఐ పరిష్కారాలను అందించాలనే లక్ష్యంతో రా ష్ట్రంలో భారత్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పా టు చేయాలని నిర్ణయించామని వివరించారు. సెంటర్ ఏర్పాటుకు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని కితాబునిచ్చారు.