17 June, 2026 | 12:00 PM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •  

బిల్లులపై రాష్ట్రపతికి గడువు.. సమీక్ష కోరనున్న కేంద్రం!

14-04-2025 11:36 PM

న్యూఢిల్లీ: రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులకు అంగీకరించేందుకు రాష్ట్రపతికి, గవర్నర్లకు మూడు నెలల గడువును సుప్రీంకోర్టు విధించడంపై కేంద్ర ప్రభుత్వం సమీక్షను కోరే అవకాశముంది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. గవర్నర్ పంపిన బిల్లులను రాష్ట్రపతి ఎటూ తేల్చకపోతే అప్పుడు రాష్ట్రాలు నేరుగా తమను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు చెప్పడంపైనా సమీక్షను కోరవచ్చని ఈ పరిణామంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి.

రివ్యూ పిటిషన్‌ను ఏ ప్రాతిపదికపై దాఖలు చేయాలనే దానిపై ఉన్నతస్థాయి ప్రభుత్వ వర్గాలు సమాలోచనలు చేస్తున్నాయని తెలిపాయి. ఈ నెల 8న తీర్పు వెలువరించిన జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనానికే ప్రభుత్వం తన వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఈ తీర్పు వెలువడిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం 10 పెండింగ్ బిల్లుల్ని చట్టాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే.