04-09-2024 12:00:00 AM
కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో ట్రైనీ వైద్యరాలి హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి న విషయం తెలిసిందే. ఘటనపై వైద్యుల ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడడంతో దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో వైద్యసేవలు సైతం స్తంభించాయి. కేసు విచారణను కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించగా, సుమోటోగా వి చారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు వైద్యుల భద్రతకు సంబంధించి తగు సిఫార్సులు చేయడానికి నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏ ర్పాటు చేసింది. చివరికి రాష్ట్రపతి సైతం ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్య కత చేశారు. ఇలా అన్నివైపులనుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైన నేపథ్యంలో హ త్యాచారానికి పాల్పడిన వారికి మరణ శిక్ష విధించే విధంగా కొత్త చట్టాన్ని తీసుకువస్తామని వారంరోజుల క్రితం ప్రకటించారు సీఎం మమత.
ఇం దుకోసం రెండు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని సైతం ఏర్పా టు చేశారు. సమావేశాల తొలిరోజయిన మంగళవారం న్యాయశాఖ మంత్రి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు.‘అపరాజిత విమెన్ అండ్ చైల్డ్’ పేరుతో ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రతిపక్ష బీజేపీ కూడా మద్దతు తెలియజేయడంతో బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లుపై కమలం పార్టీ సూచించిన సవరణలను సభ తిరస్కరించింది. దీంతో లైంగిక నేరాలపై పోరులో బెంగాల్ ముఖ్యమైన అడుగు వేసినట్లయింది. బిల్లుపై చర్చ సం దర్భంగా మమత మాట్లాడుతూ ఈ బిల్లు చరిత్రాత్మకమైందన్నారు. అత్యాచారం వంటి దారుణాలు మానవాళికి శాపాలని, ఇలాంటి ఘోరాలు జర క్కుండా సామాజిక సంస్కరణలు రావాలన్నారు.
సీబీఐనుంచి న్యాయం కోరుతున్నామని, దోషులకు మరణ శిక్ష విధించాలని అన్నారు. ఈ రోజు ప్రవేశపె ట్టిన బిల్లుపై సంతకం చేయాలని గవర్న ర్ను ప్రతిపక్షాలు కోరాలని, తర్వా త దాన్ని అమలు చేసే బాధ్యత తమదన్నారు. ఈ బిల్లుద్వారా కేంద్ర చట్టంలోని లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, సత్వర విచారణ, బాధితులకు న్యాయం లభించడమే బిల్లు లక్ష్యమన్నారు.ఆర్జీకర్ ఆస్పత్రి మృతురాలికి నివాళిగా ‘అపరాజిత’ పేరు తో తీసుకువచ్చిన బిల్లులోని అంశాల ప్రకారం అత్యాచారానికి పాల్పడిన దోషులకు జీవితకాలం పెరోల్ లేకుండా జైలు శిక్ష విధించవచ్చు.
అంతేకాకుండా అత్యాచారానికి గురయిన బా ధితురాలు మృతి చెందినా లేదా, కదలలేని స్థితికి చేరుకున్నా నిందితుడికి మరణ శిక్ష సైతం విధించడానికి వీలుంది. అలాగే మహిళలపై యాసిడ్ దాడికి పాల్పడిన దోషులకు సైతం జీవితకాలం శిక్ష విధిం చవచ్చు. బిల్లు చట్టరూపం దాల్చితే ప్రాథమిక నివేదిక నమోదయిన 21 రోజుల్లో విచారణ పూర్తి చేసి 36 రోజుల్లోగా దోషులను శిక్షించడానికి అన్ని జిల్లాల్లోను ప్రత్యేక టాస్క్ఫోర్స్లను ఏర్పాటు చేస్తారు. భారతీయ న్యాయసంహితలో దీనికి సంబంధించిన చట్టానికి ఈ మేరకు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును రూపొందించారు. నేరస్థులకు సహాయం చేయడానికి యత్నించేవారికి, బాధితురాలిగుర్తింపును బహిర్గతం వారికి అయిదేళ్ల దాకా జైలు శిక్ష విధించడానికీ బిల్లులో నిబంధనలను చేర్చారు.
అయితే ఉమ్మడి జాబితాలోని శాంతిభద్రతల అంశంపై రాష్ట్రాలు ప్రత్యేక బిల్లులు తీసుకురావ డానికి వీలున్నప్పటికీ రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే ఇవి చట్టాలుగా అమలులోకి వస్తాయి. కొత్త న్యాయచట్టాలు అమలులోకి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రత్యేక బిల్లు రూపొందించిన తొలి రాష్ట్రం బెంగాల్ అయినప్పటికీ గతంలో ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాలు ఇలాంటి ప్రత్యేక బిల్లులు తీసుకువచ్చాయి. 2019లో పశువైద్యురాలి దారుణ హత్యాచారం అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యాచారం, సామూహిక అత్యాచారాలకు మరణశిక్ష విధించే విధంగా దిశ బిల్లును తీసుకువచ్చింది. ఆ మరుసటి సంవత్సరం మహారాష్ట్రప్రభుత్వం కూడా ఇదే తరహాలో శక్తి క్రిమినల్ చట్టాల బిల్లును తీసుకువచ్చింది. అయితే ఈ రెండు బిల్లులకు ఇప్పటివరకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించలేదు. ఇప్పుడు కేవలం రాజకీయ కారణాలతో మమత సర్కార్ ఆమోదించిన అపరాజిత బిల్లు సైతం చట్ట రూపం దాల్చుతుందా అనేది అనుమానమే.