హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ
17-06-2026 08:04 PM
హైదరాబాద్: 2026 మొహర్రం ఏర్పాట్లపై భారత ప్రభుత్వ బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి లేఖకు సంబంధించి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ (IPS)తో వ్యూహాత్మక చర్చలు జరిపేందుకు బీజేపీ తెలంగాణ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ సమావేశమయ్యారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ 9వ నిజాం (ఆసిఫ్ జాహీ వంశం) ప్రతినిధి రౌనక్ యార్ ఖాన్, బీజేపీ సీనియర్ నాయకురాలు అల్కా మనోజ్ గ్రేస్ కూడా పాల్గొన్నారు.






