calender_icon.png 22 June, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీర్ఘకాలిక ప్రణాళికలతోనే వరదల కట్టడి

03-09-2024 12:00:00 AM

నేదునూరి కనకయ్య :

నదీప్రవాహ మార్గాలు హద్దులు (గట్లు) దాటి జలప్రవాహం నిలు వరించ లేకపోవడంవల్ల పరీవాహక ప్రాం తాలు మునిగిపోయే స్థితిని వరద అంటా రు. దేశంలో అనేక ప్రాంతాల్లో విభిన్న భౌగోళిక పరిస్థితులు, శీతోష్ణస్థితులు, వర్షపాతం ఉండడంవల్ల  ఏటా ఏదోఒక ప్రాం తంలో అనూహ్యమైన వరదలు సంభవిస్తున్నాయి.అధిక వర్షపాతం జూన్ సెప్టెం బర్ నెలల మధ్య వుంటుంది. ఈ కాలంలో వరదలు సంభవించే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. తుపాన్లు, వాయుగుండం వచ్చినప్పుడు కూడా అధిక వర్షపాతం వల్ల వరదలు వస్తాయి.

దేశంలో సుమారు 3290 లక్షలహెక్టార్ల విస్తీర్ణంలో భూమి వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని అంచనా. ప్రతి ఏటా దాదాపు 78 లక్షలహెక్టార్ల భూమి వరద ప్రభావానికి గురి అవుతున్నది.  దాదాపు 1700 మంది వరదల వల్ల మరణిస్తున్నారు.  రూ. 1805 కోట్ల  ఆస్తి , పంట నష్టం జరుగుతున్నదని, ఇండ్లు, రోడ్లు దెబ్బతింటున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి.  దేశ విస్తీర్ణం లో 8 శాతం భూభాగం వరదలకు గురవుతున్నటు అంచనాలు తెలుపుతున్నాయి.

వరదలకు కారణాలు

నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడ డం, నది ప్రవాహ దిశను మార్చుకోవడం వల్ల వరదలు వస్తాయి. అధిక వర్షపాతం, వాయుగుండాలు,వరదలకు కారణం అవుతాయి. నదులు, చెరువులు, కాలువలు, నదీ ప్రవాహ మార్గాలలో పూడికతో నిండిపోవడం, కాలం చెల్లిన డ్రైనేజీ వ్యవస్థలకు తోడు జలవనరుల ఆక్రమణల కారణంగా కొద్దిపాటి వానకే పట్టణాలు మునుగుతున్నాయి. భారీ వర్షాల సమయంలో భీవ హ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తు తం విజయవాడ దుస్థితికి ఇవే కారణం. డ్రైనేజీల్లో పూడికతీతపై స్థానిక సంస్థల అలక్ష్యం పలు ప్రాంతాల్లో ప్రజలకు శాపం గా మారింది. ప్రస్తుత పరిస్థితిలో సహాయ క చర్యలు కొనసాగిస్తూనే పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. '

పున రావాస కేంద్రాల్లో వసతులు కల్పించడం, వైద్య బృందాలను, ప్రాణాధార ఔషధాల ను సదా సిద్ధంగా ఉంచడం పాలకుల కర్త వ్యం. అతిగా అడవులను నరికివేయడం, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వల్ల వరదల ఉద్ధృతి పెరుగుతుంది. కొండచరియ లు విరిగిపడడంతో నదులు తమ ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల కూడా వరదలు వస్తాయి.ఆనకట్టలు, చెరువుల గట్ల నిర్మాణంలో సరైన ఇంజనీరింగ్ ప్రమాణా లు పాటించకపోవడం, నాసిరకం  నిర్మాణాలు చేయడం వల్ల చెరువులు, కుంటల కు తరచుగా గండి పడి వరదలు వస్తాయి.

మహానగరాలలో నాలాలు, డ్రైనేజ్ వ్యవస్థ నిర్వహణ లోపం, ప్లాస్టిక్ కవర్లను డ్రైనేజీలో వేయడం, చెత్త, వ్యర్థ పదార్థాలతో డ్రైనేజ్ నిండిపోవడంతో నీటి  ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. ఫలితంగా లోతట్టు ప్రాం తాల ప్రజలు వరదలకు గురిఆవుతున్నా రు. హైదరాబాద్, ముంబాయి, చెన్నైమొదలగు మహానగరాల్లో పట్టణ ప్రణాళికల అమలులో నిర్వహణ లోపాలు,  సిబ్బందిలో జవాబుదారీ తనం లేకపోవడం., పర్యవేక్షణలోపం, మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల లోతట్టు ప్రాంత వాసులు తరచుగా వరదలతో సహజీవనం చేసే స్థితి నెలకొనడం శోచనీయం. వర్షం పడినప్పుడునీరు భూమిలోకి ఇంకే విధంగా సరైన ఇంకుడు గుంతల ఏర్పాటు లేకపోవడం, నీరు ఇంకే మార్గాలను పూర్తిగాఆడ్డుకోవ డం వల్ల తరచుగా వర్షాకాలంలో వరదల తాకిడిని, వేసవి కాలంలో నీటి కొరతను ఎదుర్కొంటున్నారు.

ముందు  జాగ్రత్త చర్యలు

నదీతీర ప్రాంతాలలో తరచుగా వరదలకు గురయ్యే అవకాశం ఉన్న ప్రజలను అవి రావడానికి ముందుగానే తరలించా లి. వారికి పునరావాస సౌకర్యాలు కల్పించాలి.దీనివల్ల వరదల సమయంలో జరిగే నష్టాన్ని అరికట్టవచ్చు. వైద్య, ఆరోగ్య సౌకర్యాలను ముందస్తుగానే సమకూర్చుకో వాలి. ప్రత్యేకంగా డయేరియా, తేలు, పాముకాటుకు సరైన ఔషధాలను సిద్ధం గా ఉంచుకోవాలి. మీడియా, టీవీ, ప్రసార ప్రచార మాధ్యమాల ద్వారా వరదల వల్ల వచ్చే ముప్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రచారం చేయాలి. మంచినీరు, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు వంటివి నిలువ చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఎత్తున ప్రదేశాలను గుర్తించి పశువులను అక్కడికి తరలించే ఏర్పాట్లు చేసుకోవాలి.

వరద ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు 

సురక్షితమైన నీటిని తాగాలి. లేదంటే కలరా, డయేరియా లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది కనుక ఆహారపదార్థాలు వరద నీటిలో తడవకుండా జాగ్రత్త పడాలి. వరద నీటిలోకి వెళ్ళకూడదు. తెగిపడిన విద్యుత్తు తీగలను తాకరాదు. నివాస ప్రాంతం ముంపుకు గురవుతుందని తెలియగానే ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. వరద తాకిడికి గురయ్యే ప్రాంత ప్రజలకు ప్రతేక బీమా సౌకర్యం కల్పించాలి. ఆర్థిక నష్టనివారణ చర్యలు తీసుకోవాలి.గ్రామీణ ప్రా ంతాలలో పశువులు, వ్యవసాయ సామా గ్రి,  ఇతర సామాగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చెయ్యాలి

వరదల వల్ల నష్టాలు

వరదల వల్ల తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇళ్ల్లు, పంట పొలాలు దెబ్బతింటాయి. పంట పొలాల్లో ఇసుక మేట లు వేయడం వల్ల వ్యవసాయానికి పనికిరాకుండా పోతాయి. వరదల వల్ల ప్రజలు నిరాశ్రయులు అవుతారు. పశువులు మృత్యువాత పడతాయి. తాగునీరు కలుషిత మవుతుంది. అధిక వరదల వల్ల రోడు,్ల వంతెనలు, రైల్వేట్రాక్‌లు దెబ్బ తిని ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతింటుంది. విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థ దెబ్బతింటుంది. పురాతన భవనాలు కూలిపోతాయి. ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఆహారం, పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది. అటవీ ప్రాం తంలో జీవవైవిధ్యం దెబ్బతింటుంది. మహానగరాల్లో పల్లపు ప్రాంతాలు జలమయమవుతాయి. ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉంటుంది.

నివారణ చర్యలు

నదుల ఎగువ ప్రాంతంలో అడవులు పెంచాలి. వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయి వరదలు రాకుండా చర్యలు తీసుకో వాలి. పోడు వ్యవసాయాన్ని తగ్గించాలి. నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలి. వరదనీటిని  కాలువల ద్వారా ఇతర ప్రాం తాలకు తరలించాలి. వరద ముంపుకు గుర య్యే ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించాలి. వరదలకు సంబందించిన సమాచా రం, వరదలు ముప్పును ముందుగానే రేడి యో, మీడియా ద్వారా తెలియచేయాలి. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందిం చి సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. శాశ్వత ప్రాతిపదికన వరద నివారణ నిర్వహణ పాలన వ్యవస్థను ప్రత్యేకం గా ఏర్పాటు చేయాలి.

హైడ్రాలాంటి వ్యవస్థలు అవసరం

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన హైడ్రా లాంటి సంస్థను స్వయంప్రతిపత్తితో  శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి. వరదల నివారణ, ప్రజల పునరావాసం, ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ, జల వనరుల సంరక్షణలో ప్రభుత్వ సిబ్బందికి సాంకేతిక శిక్షణ, పాలనా పరమైన అంశాల పట్ల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. నగరాలలో మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. చెక్ డాములు, చెరువులు, కుంటల రక్షణ, బావులు, నీటి గుంతలు ఏర్పాటు చెయ్యాలి.

కాంటూర్ కందకాలు ఏర్పాటు చేసి నీటీని నియంత్రించాలి. వరద నివారణ, నియంత్రణ నిర్వహణలో పౌర సమాజానికి భాగస్వా మ్యం కలిగించాలి. వరదల నివారణ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచ డానికి స్థానిక ప్రభుత్వాలు, మున్సిపాలిటీలు, రాష్ట్ర ప్రభుత్వం సమిష్టిగా కృషి చేయాలి.  జలవనరుల సమగ్ర అభివృద్ధి తో వరదల ఉధృతి నుండి రక్షణ చర్యలు  చేపట్టి జనాభ్యుదయానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వస్తుందని ఆశిద్దాం.

  వ్యాసరచయిత రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఎకనామిక్ ఫోరం

సెల్ నం: 9440245771