04-09-2024 12:00:00 AM
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)గణాంకాల ప్రకారం, ప్రతి ఏడాది 0 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల దాదాపు 4 లక్షల మంది పిల్లలు క్యాన్సర్కు గురవుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా మారి, లక్షలాది కుటుం బాల జీవితాలను ప్రభావితం చేస్తోంది. ప్రతి రోజూ 1000 కంటే ఎక్కువ పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. అధిక ఆదాయ దే శాల్లో 80 శాతానికి పైగా పిల్లలు క్యాన్సర్ను ఎదుర్కొని జీవిస్తున్నారని, కానీ తక్కువ,మధ్య ఆదాయ దేశాల్లో ఈ రేటు కేవలం 20శాతం మాత్రమే ఉందని చెబుతున్నారు. 1970ల నుండి పిల్ల ల్లో క్యాన్సర్ మరణాల రేటు సగానికి పైగా తగ్గింది. ఇది ముఖ్యం గా చికిత్సలో జరిగిన మెరుగుదల వల్ల సాధ్యమైంది.
అయినప్పటికీ, సరిగ్గా చికిత్స అందిస్తే పిల్లలలో క్యాన్సర్ ఎక్కువ సందర్భాల్లో నయమవుతుంది. పిల్లల్లో వచ్చే క్యాన్స ర్లు పెద్దలలో కనిపించే క్యాన్సర్లతో పోలి స్తే భిన్నంగా ఉంటాయి. -4 సంవత్సరా ల పిల్లల్లో ల్యుకేమియా (బ్లడ్ క్యాన్సర్), మెదడు ట్యూమర్లు సాధారణం. 15-19 సంవత్సరాల వయసు పిల్లల్లో లిం ఫోమా, బోన్ క్యా న్సర్ ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని పర్యా వరణ కారకాలు, రేడియేషన్లు క్యాన్సర్లు పెరిగే అవకాశాన్ని కలిగించగలవ ని తెలిసినా, పిల్లల్లో క్యాన్సర్ల అసలు కారణాలు ఇంకా గు ర్తించబడలేదు. 2018లో, డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ చైల్డ్హుడ్ క్యాన్సర్ (జీఐసీసీ) ప్రారంభించింది. దీని లక్ష్యం 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 60శాతం మంది పిల్లలు క్యాన్సర్ను ఎదుర్కొని బ్రతుకుతారని నిర్ధారించడమే.
ఐఏఆర్సీ (ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్) ప రిశోధకులు పిల్లల్లో క్యాన్సర్కు సంబంధించి ఎపిజెనెటిక్ ప్రొఫైల్స్, పర్యావరణ పదార్థాలు, జీవనశైలి కారకాలు, క్యాన్సర్ వర్గీకరణలను పరిశీలిస్తూ వ్యాధులను సరిగ్గా నిర్ధారించడంలో, చికిత్సలో సహాయపడు తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియన్ పరిశోధకులు, వైద్యు లు వ్యక్తిగతంగా రూపొందించిన ప్రిసిషన్ మెడిసిన్ (సూక్ష్మ వైద్యపద్ధతి) అధిక- రిస్క్ క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లల్లో ఫలితాలను గణనీయంగా మెరుగుపరచ గలదని కనుగొన్నారు. భవిష్యత్తులో, కొత్త లక్ష్యిత చికిత్సలు క్యాన్సర్ ప్రభావిత పిల్లలకు మంచి జీవితం అందిస్తాయని ఆశిద్దాం.
డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ