calender_icon.png 19 June, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్షణ దళాలు ఏర్పాటు

19-06-2025 12:00:00 AM

భైంసా జూన్18 (విజయక్రాంతి):  జిల్లా లో వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని వరద బాధితులను ఆదుకునేందుకు రక్షణ దళాల ను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ జానకి తెలిపారు. బుధవారం జిల్లాలోని గడ్డన్న ప్రాజెక్ట్ బాసర గోదావరిలో అత్యవసర సర్వీసుల నిమిత్తం రక్షణ దళాలను ఏర్పాటు చేసి వారికి సూచనలు సలహాలు అందించారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితోపాటు స్థానిక పోలీసుల సహకారంతో ప్రత్యే క బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వీరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సిద్ధంగా ఉంటారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అవినాష్ కుమార్ పట్టణ పోలీసులు ఉన్నారు.