19-06-2025 12:00:00 AM
మిల్లెట్ బిస్కెట్ యూనిట్లకు పలు అవార్డులు
రుతు క్రమంపై బాలికలకు అవగాహన కల్పించాలి
ఆదిలాబాద్, జూన్ 18 (విజయక్రాంతి) : మహిళా స్వయం సహాయక సంఘాలు ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మున్సిపల్ శాఖ మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘా లు ఏర్పాటు చేసిన వివిధ తయారీ కేంద్రాలను బుధవారం కలెక్టర్ ప్రారంభించారు. ముందుగా ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ పాత భవనంలో అరుంధతి స్వయం సహాయక మహిళా సంఘం గ్రూప్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శాని టరీ ప్యాడ్స్ తయారీ యూనిటును కలెక్టర్ ప్రారంభించారు.
అదేవిధంగా గాంధీ నగర్ లో ఈగ విజయలక్ష్మి, వీరాంజనేయ స్వయం సహాయక సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసినషుగర్, మైదా వాడని మిల్లెట్ బిస్కెట్స్, లడ్డు తయారీ యూనిట్ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 22 రకాల మిల్లెట్ బిస్కెట్స్ తయారీలో ఏ రకమైన ఆయిల్ వాడకుండా తయారు చేయడం జరుగుతోందని, ఇందులో డ్రై ఫ్రూట్స్, పల్లి, నువ్వులు, సోయా గింజలు ఇతర మిల్లెట్స్ ను వాడి బిస్కెట్ల తయారీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు.
ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంట్ర్పస్ స్కీం క్రింద 60 లక్షల లోన్ తీసుకొని 10 లక్షల సబ్సిడీతో ఈ యూనిట్ ప్రారంభించమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఈ మిల్లెట్ బిస్కెట్ యూనిట్లకు పలు అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. మరోవైపు ఆరోగ్య పాఠశాలలో భాగంగా రుతు క్రమంపై బాలికలకు అవగాహన కల్పించాలన్నారు.
ఋతుక్రమం సమయంలో అనారో గ్య సమస్యలు దరిచేరకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆరోగ్య స్వీయ రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్, డీఈవో శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ వైద్యాధికారిని డాక్టర్ సాధన, మున్సిపాల్ కమిషనర్ రాజు, మెప్మా సిబ్బంది, స్వయం సహాయక సంఘం మహిళా సభ్యులు, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.