calender_icon.png 20 June, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణికుల భద్రతే ముఖ్యం

19-06-2025 12:00:00 AM

ఎస్పీ అఖిల్ మహాజన్

అదిలాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): ప్రయాణికుల భద్రత రక్షణ ధ్యేయంగా జిల్లాలో తొలిసారిగా ప్రజల రవాణాకు చర్య లు చేపట్టడం జరిగిందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రయాణాల్లో అతి ముఖ్యమై న ఆటోలలో ‘అభయ మై టాక్సీ ఇస్ సేఫ్‘ అనే కార్యక్రమాన్ని స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఉట్నూర్ ఏఏస్పీ కాజల్ సింగ్ తో కలిసి బుధవారం ఎస్పీ  జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పలు ఆటోలకు క్యూఆర్ కోడ్ కు సంబంధించిన స్టిక్కర్లను అతికించారు.  అనంతరం ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లాలోని ఇప్పటి వరకు 3,232 ఆటోలలో ‘అభయ మై టాక్సీ ఇస్ సేఫ్‘ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఆటోలలో ముందు భాగంలో,  వెనుక భాగములో క్యూఆర్ కోడ్, జిల్లా ప్రత్యేక నం బరు కలిగిన పోస్టర్ అతికించబదిందన్నారు.

మహిళలు ఎలాంటి అత్యవసర సమయంలోనైనా ట్రాక్ మై లొకేషన్ అనే ఆప్షన్‌ను ఎంచుకున్నట్లయితే కమాండ్ కంట్రోల్ సెం టర్ ద్వారా అనుసంధానం చేయబడి ఉన్నందున కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి మీకు వెంటనే ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకుంటారని, లేనియెడల మీ ఫోన్ ను ట్రాక్ చేయడం జరుగుతుందని తెలిపారు. రెండవ ఆప్షన్ ఎమర్జెన్సీ కాల్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత వెంటనే డయల్ 100 నుండి మీకు ఫోన్ కాల్ వస్తుందని తెలిపారు.

మూడవ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీకు ఎలాంటి ఫిర్యాదు నైనా సమర్పించవచ్చని తెలిపారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సక్రమంగా గమ్యస్థాలన చేరుతున్న ప్రయాణికులు ఆటోలకు రేటింగ్ కల్పించవచ్చని తెలిపారు. అదేవిధంగా ఆటోలలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుం డా, ఉత్తమ రేటింగ్ కలిగిన ఆటోల డ్రైవర్లను యజమానులకు అవార్డులను అందించి ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.

అదేవిధంగా ఆటోలలో ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరిగిన వెంటనే డయల్ 100 కు సమాచారం అందించి సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి  జీవన్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రణయ్ కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్లు సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్ రావు, ఎస్‌ఐలు ముజాహిద్, అశోక్, మహేందర్, దేవేందర్, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.