17-06-2025 08:50:03 AM
హైదరాబాద్: తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) మంగళవారం నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో(Jayashankar Bhupalpally district) పర్యటించనున్నారు. కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్లో విద్యుత్ ఉపకేంద్రాన్ని భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. మంజూరునగర్, ధర్మారావుపేట, నవాబుపేటల్లో సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ప్రజాప్రభుత్వం చేపడుతున్న, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతులు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.