21 April, 2026 | 4:45 PM

Breaking News

ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

గ్రామ పంచాయతీల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

11-04-2025 12:44 AM

నారాయణఖేడ్, ఏప్రిల్ 10:భారతీయ జనతాపార్టీ విజయాల్లో కీలకపాత్ర వహించిన కార్యకర్తల సేవలు మరువలేనివని బీజేపీ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పత్రీ రామకృష్ణ అన్నారు. అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ ఖేడ్, మండల పార్టీ అధ్యక్షుడు సిందోల్ దశరథ్, మున్సిపల్ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ బీజేపీ 45వ వ్యవస్థాపక వారోత్సవాలలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈనెల 14న అన్ని గ్రామాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు జరపాలని, గావ్ చలో అభియాన్ లో భాగంగా పీఎం నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, బీజేపీ సువరిపాలనను ప్రజలకు వివరించాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఎంబారి విఠల్, సిదయ్య స్వామి, యువమోర్చ జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్, పార్టీ ప్రధాన కార్యదర్శి సచిన్, కిసాన్ మోర్చా అధ్యక్షులు గౌడ దశరథ్, అశోక్ గౌడ్ వెంకటేష్, నవీన్, కానికేందర్, విష్ణు రెడ్డి, యువమోర్చ మండల అధ్యక్షులు భూంరాజ్, మండల కమిటీ సభ్యులుపాల్గొన్నారు.